మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ప్లీనరీ, జీవన్ రెడ్డి చేరికపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
గోవులను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్న వ్యక్తిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంద మల్లమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది.
కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడైపోయేలా కావాలనే ఇలాంటి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవిలో డిమాండ్కు అనుగుణంగా నగరంలో 24/7 ట్యాంకర్లను సరఫరా చేయనున్నట్లు వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. ర్యాష్గా కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. నేడు ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవనున్నారు.
కేరళం సీఎం పినరాయి విజయన్కు ప్రధాని మోదీ గాడ్ఫాదర్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసుల నుంచి విజయన్ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద వైసీపీ నేతల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు.
ఆటో ఎల్పీజీ తెప్పించి బంకుల్లో ఎక్కడా కొరత లేకుండా చూడాలని కంపెనీలకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గత వారం రోజులుగా కంపెనీలు మంచి పనితీరు కనబరిచాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆటో ఎల్పీజీ (Auto LPG) సరఫరా చేసే ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.