హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది.
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఖాజాగుడా నుంచి గచ్చిబౌలి వైపుకు వెళ్తుండగా స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నగరం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 15, వంకాయ 35, బెండకాయ 35, పచ్చిమిర్చి రూ. 45లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె సొంత అభిప్రాయమంటూ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.