మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య సంఘటనను.. ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో ప్రస్తావించారు . బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ విధానాలపై ఆమె తన అభిప్రాయాలను చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
హైదరాబాద్లోని కొండాపూర్ జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా సీరియస్ అయ్యింది. దాదాపు రూ.700 కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించింది..
హైదరాబాద్లో పులి అవయవాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు..
బైక్పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు సీపీ సజ్జనార్.. సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. బైక్ మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం అని పేర్కొన్నారు..
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. భార్య వెళ్లిపోయిందనే మనస్తాపంతో సీతారాం అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్ 28, క్యారెట్ 18లకు విక్రయిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం డీసీపీ సీ.హెచ్. శ్రీనివాస్ నిషేధాజ్ఞలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం పట్టుకుంది. కారు, సెల్ ఫోన్తో పాటు 84 ఢిల్లీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూసీ నది అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తెచ్చారా? అంటూ వారిని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని వారు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.