వాటర్బోర్డు అధికారిక లోగోను ప్రైవేట్ నీటి ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
ఎర్త్ అవర్లో భాగంగా ఈరోజు ఒక గంట పాటు అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 13, బెండకాయ 35, పచ్చి మిర్చి 43లకు విక్రయిస్తున్నారు.
ప్రజా సమస్యలు పెండింగ్లో ఉండగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు అవసరమా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని రంగాలు సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో క్రీడల్లో పాల్గొని సమయం వృథా చేయడం తగదని హితబోధ చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం పెరగనుందా!? అసెంబ్లీ మూడో వంతుకుపైగా మహిళలతోనే నిండనుందా!? ఇందుకు అనుగుణంగానే, రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి .........
తెలంగాణ హాకీ చైర్మన్, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్ను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 గంటల పాటు వివిధ కోణాల్లో ఆయనపై ఐటీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.
శ్రీరాముడు ధర్మానికి.. సీతమ్మ తల్లి పవిత్రతకు ప్రతీక అని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అభివర్ణించారు. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని తెలిపారు.
శోభాయాత్ర వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయ వద్దని ప్రజలకు నగర సీపీ సజ్జనార్ సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వార్నింగ్ ఇచ్చారు.
మావోయిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్న కవులు, కళాకారుల కన్నీటిని, స్నేహాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మాననీయకోణంలో చూడాలని, నేరంగా చూడవద్దని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కోరారు.
శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు.