• Home » YSRCP

YSRCP

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి.. 19 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి.. 19 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 19 మంది కీలక వైసీపీ నేతలపై జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిలిం నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పాదయాత్ర కాదు..‌ మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న

పాదయాత్ర కాదు..‌ మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జగన్ బెదిరింపులు..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జగన్ బెదిరింపులు..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. వైసీపీ అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గౌరవం లేదని.. తాము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న జగన్..

 వైసీపీ హయాంలో విధ్వంసమే అజెండాగా పాలన సాగించారు: ధూళిపాళ్ల

వైసీపీ హయాంలో విధ్వంసమే అజెండాగా పాలన సాగించారు: ధూళిపాళ్ల

వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసమే అజెండాగా పాలన సాగించారని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రజలు వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా తీరు మాత్రం మారలేదని ఆగ్రహించారు.

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన

అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లింది: జనసేన

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు.

రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కాం

రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కాం

వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై ఏపీ ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారుల నివేదిక చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు.

 జగన్ అండ్ కో వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి: జనసేన

జగన్ అండ్ కో వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి: జనసేన

వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై జనసేన అగ్రనేతలు అధికారిక లేఖ విడుదల చేశారు. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ఆందోళనకు వైసీపీ ప్లాన్.. పోలీసుల బందోబస్తు

ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ఆందోళనకు వైసీపీ ప్లాన్.. పోలీసుల బందోబస్తు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మీడియా సంస్థలపై వైసీపీ నేతల బెదిరింపు ధోరణి సరికాదు: రామచందర్ రావు

మీడియా సంస్థలపై వైసీపీ నేతల బెదిరింపు ధోరణి సరికాదు: రామచందర్ రావు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద వైసీపీ నేతల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతాం: బొత్స సత్యనారాయణ

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతాం: బొత్స సత్యనారాయణ

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరైనా విమర్శ చేస్తే విధాన పరంగా ఉండాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి