Home » YSRCP
వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలమంచిలి సురేశ్పై దాడి చేశారు. సురేశ్పై హత్యాయత్నానికి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్ పాల్పడ్డారు.
ఏపీ ప్రభుత్వ అద్దె హెలికాఫ్టర్పై వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగింది. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రికి గతంలో ఉన్న హెలికాఫ్టర్ స్థానంలోనే వేరే హెలికాఫ్టర్ను అద్దెకు తెప్పిస్తున్నారని ఏపీ ప్రభుత్వ అధికారులు వివరించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.
ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో వారిని అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది.
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిల ఫొటోలను స్టేటస్గా పెట్టుకున్నారు టీడీపీ కార్యకర్తలు. దీన్ని వైసీపీ మూకలు సహించలేకపోయాయి.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆదివారం ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి కోరారు.
వైసీపీ నేత కొడాలి నానికు నేటితో విముక్తి లభించింది. ఆయన బెయిల్ షరతుల గడువు నేటితో పూర్తి అయింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బెయిల్ పొందిన కొడాలి నానికు..