Home » YSRCP Cadre
నెల్లూరు: బలవంతంగా రూ. వంద ఇస్తాం.. రెండు వందలు ఇస్తామని చెప్పి వైసీపీ సభకు తీసుకువచ్చిన జనాలు 10 నిముషాలు కూడా ఉండడంలేదు. అసలే ఎండాకాలం... వైసీపీ ప్రభుత్వంపై పీకల వరకు కోపం.. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబూ అంటూ వెయ్యి కళ్లతో చూస్తున్న తరుణంలో ఎంత పెద్దాయన వచ్చినా జనం వింటారా? వినరు.
ఆంధ్రప్రదేశ్లో అసలేం జరుగుతోంది..? పాలక పక్షమైన వైసీపీ అక్రమాలపై ఫిర్యాదులేమో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి..
ఎన్నికల సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వింతలూ విశేషాలకు లోటుండదు. ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రోడ్లు ఊడ్చడం.. బజ్జీలేయడం రకరకాలవి చేస్తుంటారు. ఈక్రమంలోనే నేతలు అలవాటులో పొరపాటుగా నోరు కూడా జారుతూ ఉంటారు.
తనపర భేదం లేదు. అక్రమాలను అడ్డుకునే ఎవరినైనా టార్గెట్ చేయడమే. మహిళలను సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్(Social Media Trolls) చేయడమే. అధికార వైసీపీ(YCP) అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇదీ. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్యకూ ఈ దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడమే ఆమె చేసిన నేరం.
YS Jagan Siddham Sabha: ‘అన్నీ నేనే చేశా. నావల్లనే ప్రజలంతా బతుకుతున్నారు. నాకు సీఎం పదవిపై వ్యామోహం లేదు. మళ్లీ సీఎంగా నన్ను గెలిపించకపోతే పేదలకు అందే పథకాలన్నీ పోతాయి. పొత్తులతో వచ్చే వారిని కాదని పేదల కోసం పనిచేస్తున్న నన్ను గెలిపించండి’.. ఇలా ప్రజలను బ్లాక్మెయిల్ చేసేలా, అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తును విమర్శిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు...
YS Jagan Siddham Sabha: కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్ మాయాజాలంతో లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులపాలైంది..
YS Jagan Siddham Sabha: మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతానని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ఈ ముచ్చట ఐదేళ్లకే ముగియనుందని అర్థమైపోయిందా..? పదవి పోతుందని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారా..? బాపట్ల జిల్లా మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ఆయన ప్రసంగం జనానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి...
YS Jagan Siddam Sabha: అవును.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy) ప్రసంగంలో ఈ మధ్య అస్సలు పస ఉండట్లేదు. పైగా సెంటిమెంట్ పండించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిగో ఫలానా చేశాను.. మళ్లీ అధికారమిస్తే ఇంతకుమించి చేస్తానని చెప్పుకోలేక ఏదోదే మాట్లాడేస్తున్నారు...
YS Jagan Siddham Sabha: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy) ప్రసంగంలో ఒకటా రెండా.. లెక్కలేనన్ని డైలాగ్స్.. అంతకుమించి పంచ్లు, కౌంటర్లు ఉంటాయ్.! ఇవన్నీ ఒకసారి, రెండు సార్లు మహా అంటే మూడు సార్లు వినడానికి బాగుంటుంది కానీ.. ఏ సభలో చూసినా ఇవే మాటలు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇవే డైలాగ్స్.. ఇప్పుడు చెప్పండి.. పదే పదే అవే మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది.. విరక్తి అనిపించదూ.!
2017లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్ కిశోర్ స్వయంగా వెల్లడించారు. 2017లో పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకోవాలని చాలా మంది వైసీపీ నేతలు భావించారని, ఈ మేరకు తనకు సలహా ఇచ్చారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ‘‘ అది 2017 ఆగస్టు అనుకుంటా. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోయాక వైఎస్సార్సీపీలోని నేతలు, పార్టీ సానుభూతిపరులు చాలామంది పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలని నాకు సలహా ఇచ్చారు’’ అని పీకే బయటపెట్టారు.