Home » YS Jagan Mohan Reddy
ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే వైసీపీకి తెలియదని ఆక్షేపించారు. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్డీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వైసీపీ అంతమయ్యే పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు.
విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని హోంమంత్రి అనిత తెలిపారు. కొండారెడ్డి యువతకు డ్రగ్స్ ఇచ్చి పాడు చేస్తుంటే జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయడంపై సాక్షి మీడియా, వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సాక్షి పత్రికలో ప్రైవేట్ స్కూల్ బాలికపై లైంగిక దాడి అని వార్త ఇచ్చారని.. అదే వార్తపై ఇవాళ బాలిక కాదు వివాహిత అని రాశారని అనిత మండిపడ్డారు.
జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని... కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరు మీద వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలు ఆపాలని హితవు పలికారు మంత్రి అచ్చెన్నాయుడు.
జగన్ అధికారంలో ఉండగా అమరావతి రైతులను ముప్పుతిప్పలు పెట్టారని... ఇప్పుడు రైతుల పరామర్శ అంటారా అంటూ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు.
గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.