Home » YS Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయ్..! దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు చివరి అస్త్రాలుగా ఏమున్నాయా..? అని బయటికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే.. కీలక నేతలు, పార్టీల అధిపతులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ (YSR Congress) ఓ రేంజిలో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం (Pithapuram) నుంచి పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (Pawan Kalyan) కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) ఉసిగొల్పింది వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని ఈ వైయస్ జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తాజాగా రుజువులతో సహా బహిర్గతం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద దిగిచ్చింది. అందుకు సంబంధించిన సీడీఎంఏ వెబ్సైట్ని చాలా సైలెంట్గా మూసివేసింది.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల (AP Pensions) పంపిణీపై ఎంత హైడ్రామా జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్ ప్రభుత్వం (Jagan Govt) పన్నిన పన్నాగంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితి. మండుటెండలో వెళ్లి బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. ఆఖరికి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకునే సరికి.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పార్టీ మారిన నేతలు అయితే.. బాబోయ్ మునుపటి పార్టీ బాగోతం బట్టబయలు చేస్తున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా మీడియా మీట్, బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దుమ్ముదులిపేస్తున్నారు. తాజాగా.. ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ (YSR Congress) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నది ఒకే ఒక్క మాటే అయినా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆయన ఏమన్నారో చూసేద్దాం రండి..!
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే ఈ యాక్ట్తో పేదలు చాలా నష్టపోతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలకు సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) సరైన వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు దిమ్మతిరిగేలా జగన్ కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల వేళ ఏపీలో చిత్ర, విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు గ్రామాల్లో తిరుగుతున్న సర్వే సంస్థల ప్రతినిధులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారట. ఓటర్ల నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని.. ఈ ఎన్నికల్లోనే ఓటర్ల నాడి బయటపడటం లేదట.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ జరుగుతుంది.