Home » Yemmiganur
నకు ఓటు వేయని వారికి కూడా తాను ఎమ్మెల్యేను అని, అర్హులైన ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. వెంకటగిరి గ్రామంలో గురువారం రైతన్నా మీకోసం- అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ పట్టణ కార్యాదర్శి రంగన్న, సీపీఐ ఎంఎల్ న్యూ డెమెక్రసీ నాయకుడు రాజు కోరారు.
మండలంలోని పార్లపల్లి, పరమాన్దొడ్డి, మల్కాపురం, దైవందిన్నె, వెంకటగిరి తదితర గ్రామాల్లో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఉద్యోగావకాశాలు తమకు కల్పించాలని మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు కోరారు.
ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మౌజమ్లకు వేతనాలు విడుల చేశారని జామీయ మసీదు అధ్యక్షుడు సాబీర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉసేన్ పీరా, టీడీపీ ముస్లిం, మైనార్టీ నాయకులు కలీముల్లా, కేఎండీ ఫరూక్, బందనవాజ్, తురేగల్ నజీర్, కౌన్సిలర్లు ఇసాక్, అమాన్, వహీద్లు అన్నారు.
మండలంలోని గుడికల్లో ఉన్న 1.80 ఎకరాల గ్రామకంఠకం భూమిని కాపాడాలని కోరుతూ గుడికల్ గ్రామానికి చెందిన పలువురు శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
సొంతింటి కల సాకారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో 87వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా హోమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకే కాదు.. భక్తులకు కూడా భద్రత కరువైందని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్చార్జి రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్రెడ్డి అన్నారు.
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీకృష్ణపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా రెండో రోజు మహాగణపతి, సుదర్శన రుద్రహోమాలు, రమాసతి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.