Home » YCP
ఇవాళ హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. ఈ దాడులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడులు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశ్నించిన మీడియాపై వైసీపీ దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులను మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా 4వ స్తంభం అన్న ఇంగిత జ్ఞానం కూడా జగన్కు లేదు... రాదు అని విమర్శించారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ దాడులను హోంమంత్రి అనిత, ఎంపీలు కేశినేని శివనాథ్, కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. డైవర్షన్ కోసమే ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులకు పాల్పడిందని నేతలు ఆరోపించారు.
వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. మంగళవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. ముందస్తుగానే పక్కా ప్రణాళికతో..
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ హంగామా సృష్టించింది.
ఆదోనిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అందరినీ సంప్రందించి అమరావతిని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతికి జగన్ కూడా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.
దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకించి.. సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ.. స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గురువారం రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.