Home » YCP
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో సామాజిక న్యాయం కరువు అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సొంత సామాజికవర్గ నేతలను నెత్తికి ఎక్కించుకుంటోన్న పార్టీ అధ్యక్షుడు జగన్.. ఇతర కమ్యూనిటీల నాయకులపై వేటు వేస్తోన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి.
బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు.
జిల్లాలో 30 యాక్టు అమల్లో ఉన్నందున బహిరంగ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు.
డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం చేపట్టిన ర్యాలీలకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడ్డారు.
డబ్బుతో కాదు.. కష్టపడి చదివి, మెరిట్ ఆధారంగా ఉద్యోగం సాధించాం’ అని మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత స్పష్టంచేశారు.
మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జిలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా చేసే నిరసనలను ఏమాత్రం ఉపేక్షించబోమని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించారు.