Home » YCP
ప్లాన్ ప్రకారమే తన నివాసంపై దాడి చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఫేస్బుక్లో పోస్టులు పెట్టి మరీ దాడి చేయించారని, కొన్ని వందల మంది వచ్చి తన ఇంటిపై దాడి చేశారని మాజీ మంత్రి తెలిపారు.
వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, అలజడులు సృష్టించాలని ప్లాన్ చేస్తోందని సీనియర్ మంత్రులు విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్లో వైసీపీ ట్రాప్లో పడొద్దని టీడీపీ నేతలకు సూచించారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తిరుమల లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారని విమర్శించారు.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు కన్నెర్రజేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు..
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు.
వెలిగొండ ప్రాజెక్ట్ను జాతికి అంకింత చేసినట్టు మాజీ సీఎం వైఎస్ జగన్ డ్రామాలాడారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమైన వైసీపీ నాయకులకు వదిలి టీడీపీ నేతలపై సీఐ కనకరావు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.
లిక్కర్ స్కాం అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో అసలు లిక్కర్ స్కాం అనే విషయమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.