Home » YCP
అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట.
గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెంపల్లి గ్రామస్తులు యార్లగడ్డ వెంకట్రావుకు జేసీబీలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లలో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే అన్ని వర్గాల ప్రజలు జగన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన
అనంతపురం అర్బన, మే 3: ఒక్క అవకాశం ఇస్తే అనంత అర్బన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది..? దగ్గుబాటి: మా ఎన్నికల ప్రచారం ప్రతి రోజు అశేష జనవాహిని మధ్య సాగుతోంది. ఏ కాలనీకి వెళ్లినా మాకు స్థానిక ప్రజల నుంచి అ...
ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉండటంతో.. ప్రజల మూడ్ను మార్చేందుకు జగన్ అండ్ కో అనేక కుట్రలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ వైపు జగన్ గెలవడంతో పాటు.. మరోవైపు విపక్షంలో కీలక నేతలను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది.
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ చూపలేదు. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన నిలబెట్టుకోలేదు. కరువు జిల్లా అనంతలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. యువత పొట్టచేతపట్టుకొని వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బటన నొక్కి.. అంతా చేసేశామనే భ్రమలో జగన ఉన్నారని యువత మండిపడుతోంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత.. ఈ ఎన్నికల్లో కీలక ...
టీడీపీ కండువా వేసుకుని మాకే ఎదురుగా వస్తావా? ఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి సోదరుడు రాజశేఖర్రెడ్డి, అతడి అనుచరులు టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని గువ్వలగొందంపల్లిలో గురువారం జరిగింది. బాధితుడు టీడీపీ కార్యకర్త బెల్లం వేణుగోపాల్ తెలిపిన మేరకు.. తమ బంధువు చనిపోవడంతో కుటుంబసభ్యులతో కలిసి పరామర్శించి తిరిగి కారులో స్వగ్రామమైన గువ్వలగొందంపల్లికి బయల్దేరారు. న్యామద్దల గ్రామ శివారులోకి రాగానే ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సోదరుడు...
తనది మైనార్టీల ప్రభుత్వమని మోసం చేసిన జగనను ముస్లిం సమాజం ఇక ఎన్నటికీ నమ్మదని శాసన మండలి మాజీ చైర్మన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ మహా సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ జగన హయాంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ కూటమిలో ...