Home » Warangal News
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
BRS Leaders Arrests: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనగామ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో జనగామలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
CM Revanth Reddy: భూసేకరణ పూర్తిచేసి వీలయినంత త్వరగా డిజైనింగ్కు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.
Bandi Sanjay Kumar: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ కోరారు.
Huge Fire Accident: తెలంగాణలోని జనగామ జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాదం జరగడంతో పరిశ్రమలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేదలను, రైతులను సీఎం రేవంత్రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్రావు విమర్శించారు.
హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకల బెడద తీవ్రమవుతోంది.
హనుమకొండలో తాజాగా మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలిక మృతిచెందింది. ఈనెల 2వ తేదీన జ్వరంతో డాల్ఫిన్ హాస్పిటల్లో ములుగు జిల్లాకు చెందిన వర్షిత చేరింది. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యుల సవాల్కు సామరస్యంగా సమాధానం అధికార పార్టీ సభ్యులు చెప్పాలని అన్నారు.