Home » Warangal News
హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.
హనుమకొండ నయీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనతో హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని కొండా మురళి ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాయిని చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు.
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.