Home » Visakhapatnam
విశాఖలోని ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలిలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరగబోతోందని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.
విశాఖలోని సమతా డిగ్రీ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా లెక్చరర్ వేధించడంతోనే విద్యార్థి సాయితేజ మృతి చెందాడని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెుంథా తుపాన్ ముంచుకొస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి బృందం రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనుంది. విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామం అని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు..
1929వ సంవత్సరం నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వస్తున్నామని విశాఖ సీపీ అన్నారు. సమాజం సురక్షితంగా ఉంది అంటే పోలీసుల కృషి కారణమన్నారు.
ప్రోటోకాల్ విధులు ఆర్డీవో చూడాల్సి వస్తుందని.. కానీ ప్రోటోకాల్ విధుల విషయంలో తనకు చివరి నిమిషంలో సమాచారం ఇస్తున్నారని శ్రీలేఖ వాపోతున్నట్లు సమాచారం. కానీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల పేషీలకు ఆమె చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నారని సిబ్బంది చెబుతున్న పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో భారీ పేలుడు చోటుచేసుకుంది.