Home » Vikarabad
హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి శంషాబాద్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు..
కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని, వికారాబాద్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని రేవంత్ విమర్శించారు.
వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామేశ్వర ఆలయం మలుపులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు బైకుపై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండేళ్లుగా ఆఫీస్ చుట్టు తిరుగుతున్న పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది..