Home » Vijayawada
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
Konakalla fire on Jagan: గత ఐదేళ్లు అబద్దాలు ప్రచారం చేసినందుకే రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి బుద్ది చెప్పారని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. అయినా ఇంకా అవే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.
YCP: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో ఆయన నోటి నుంచి వచ్చిన ‘రప్పా రప్పా’ డైలాగ్ ప్రభావం ఆ పార్టీ కార్యకర్తలపై పడింది. దీంతో వారు పేట్రేగిపోతున్నారు. రప్పా రప్పా అని నరికితే మంచిదేనన్న జగన్ కామెంట్లతో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.
BJP: ప్రధాని మోదీ యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని.. రైతులు, యువత, మహిళలను అభివృద్ధి పథంలో నడపాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతను ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో పోలీసు అధికారులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో చెవిరెడ్డి హంగామా చేశారు.
మద్యం ముడుపుల ద్వారా వెనకేసుకున్న డబ్బులను 2024 ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. ఈ డబ్బు తరలించడానికి నిందితులు ఏకంగా ఒక ట్రక్కును ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది.
Chevireddy Bhaskar Reddy: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సిట్ కార్యాలయంలో మూడు గంటలకు పైగా అధికారులు ఆయనను విచారణ చేశారు.
Modi Golden Chapter: జల జీవన్, ఆయుష్మాన్ భారత్, ఇలా అనేక కేంద్ర పథకాలతో ప్రధాని మోదీ పేదలకు మంచి చేస్తున్నారని, పర్యావరణాన్ని కాపాడటంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్తో రక్షణ రంగంలో ఎంత ప్రగతి సాధించామో ప్రపంచ దేశాలకు చాటి చెప్పామన్నారు.
Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.