Home » Videos
హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు, కార్యకర్తలు జమ్మికుంటలో రహస్య సమావేశం నిర్వహించారు.
‘వైఎస్’ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతులవారీగా విమర్శల దాడి చేస్తుండటంతో... మరోమారు తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ‘క్లారిఫికేషన్’ రూపంలో కుమారుడు వైఎస్ జగన్కు షాక్ ఇచ్చారు.
పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది. ఖతార్పై ఇరాన్ దాడులను భారత్ ఖండించగా.. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇక దేశంలో ఎల్పీజీ సరఫరాపై..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. యుద్ధం విస్తృతి, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ పరాభవ నామ సంవత్సరంలో రాశి ఫలాలను బ్రహ్మశ్రీ పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ వివరించారు. గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఉగాది పండగ వేళ.. ఈ ఏడాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయనే అంశాలను ఆయన వివరించారు.
తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది. టీవీకే, బీజేపీ ఒక్కటవనున్నాయా? ఈ రెండు పార్టీల పొత్తు వ్యవహారంలో నటి త్రిష కీలక పాత్ర పోషిస్తోందా..? అమిత్ షాతో త్రిష ఎందుకు భేటీ అయ్యింది..?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. కేంద్రం విధించిన డెడ్ లైన్కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు చర్చిస్తున్నారు.
అత్తరు సువాసనలు వెదజల్లుతోంది. ఈద్ సమీపించడంతో అత్తరు విక్రయాలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల అత్తరు వ్యాపారం జరుగుతుంది.