Home » Videos
ఇవాళ్టి(బుధవారం) రాశిఫలాలకు సంబంధించి ప్రతి రాశివారికి ప్రధాన సూచనలు చేశారు జ్యోతిష్య విశారద డాక్టర్ కె.వేణుగోపాల్. నేటి పరిస్థితులు, వ్యవహార పరామర్శలు, ఆరోగ్యం, ఆర్థిక అంశాలను వెల్లడించారు. కొన్ని రాశుల వారికి పని భారం పెరుగుతుందని.. శ్రమకు తగిన ఫలితం ఉండదని వివరించారు.
కూటి కోసం కోటి విద్యలు అనేది ఒకప్పటి మాట. పెళ్లి కోసం పిచ్చ కష్టాలు అనేది నేటి మాట. పెళ్లి కాని ప్రసాదలందరూ ఏం చేయాలో అర్థం కాక.. తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. చిత్తూరు జిల్లా కలికిరిలో పెళ్లి కాని ప్రసాద్లు ఏం చేశారో తెలియాలంటే ఈ వీడియోను వీక్షించాల్సిందే.
మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు గోదావరి నదిలోని ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు మనవడు, ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు.
హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి చోటు చేసుకుంది. టెక్నికల్ సమస్య కారణంగా ఎయిర్ బెలూన్ చెరువులో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం నాడు గోల్కొండ నుంచి గండిపేట్ వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Road Transport Ministry: ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నిలిపేయనుంది. ఈ మేరకు వాహనదారులు టోల్ చార్జీలను కచ్చితంగా ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే..
ఈ రోజు జనవరి 17 2026 శనివారం.. పన్నెండు రాశుల్లో ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? గ్రహాల ప్రభావం ఎవరిపై ఎలా ఉండబోతోంది.. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..
కోనసీమ జిల్లా జగన్నతోట ప్రభల తీర్థ మహోత్సవంలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. వైసీపీ జెండాలు పట్టుకుని వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల దుశ్చర్యపై భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ జెండాలు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు తెలిపారు.
బెంగళూరులో ఓ కారుపై భారీగా ఫైన్ ఉంది. కేవలం రూ. 70 వేల విలువ చేసే కారుపై లక్షకు పైగా జరిమానా ఉంది. ప్రస్తుతం ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో పలు రాష్ట్రాలలో.. ఒక్కో రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లు మంజూరు చేశారని ఆర్మీ ఉన్నతాధికారులకు సీఎం వివరించారు.