Home » Uttar Pradesh
అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కుంభకోణంపై యూపీ సీఎం యోగి ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అలాంటి పవిత్రమైన నమ్మకంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
లఖ్నవూలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
లఖ్నవూలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల విరాళాల చోరీపై ఇప్పటివరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు.
అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఒకప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం 2 మార్కుల తేడాతో అర్హత సాధించలేక నిరాశకు గురైన విద్యార్థి, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తగా ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.
ఓ యువకుడు, పోలీస్ అధికారికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. పోలీస్ అధికారి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో వివాదం చెలరేగింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తున్నారని యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు.
యువత తలచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు యువకులు చేసిన పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వారి కృషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.