Home » Uttam Kumar Reddy Nalamada
బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గోదావరిలో నీళ్లను ఇరు తెలుగు రాష్ట్రాలు వాడుతున్నాయని వివరించారు. విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. ఇక్కడికి వచ్చిన నీటిని మరో బేసిన్కు తరలిస్తున్నామని తెలిపారు. కృష్ణాలో తక్కువగా ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
CR Patil meeting: సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనలో ఉంది. అందులో భాగంగా గురువారం కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంలో తమకు ఉన్న అభ్యంతరాలను కేంద్రమంత్రికి వివరించామని చెప్పారు.
Banakacharla Project: డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడ్డుకోవడంతో పాటు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేయనున్నారు.
గోదావరి-బనకచర్లపై చివరి అస్త్రంగా న్యాయపోరాటం చేయాలని అఖిలపక్షం ఎంపీలు నిర్ణయించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం చొరవ, చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చారు.
పోలవరం-బనకచర్ల అనుసంధానం కోసం చేపట్టిన ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణ అనుమతి ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని తెలంగాణ కోరింది.
నికర జలాలు లేని ప్రాజెక్టుకు డీపీఆర్ దాఖలు చేయాలని ఎలా కోరతారని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్పై బురద జల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని హరీష్రావు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకుంటామని, నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఎక్కడిదాకైనా వెళతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.