Home » Trending News
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబో కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. సమాచారం మేరకు.. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు నగరంలోని చర్లపల్లిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ ఫ్యాక్టరీని సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
జబల్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజుల కిందట ఓ గర్భిణి కాన్పు కోసం వచ్చింది. వైద్యలు ఆమెకు పరీక్షలు చేశారు. అయితే శిశువు బరువుగా ఉండడం వల్ల సాధారణ కాన్పు సాధ్యం కాలేదు. దీంతో చివరకు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. శిశువు జన్మించిన తర్వాత బరువు తనిఖీ చేయగా..
జీవితంలో తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని మరింత స్పెషల్ మెమొరీగా మార్చుకుంది ఓ యువతి. తన మొదటి జీతంతో తండ్రి 30 ఏళ్ల కలను నెరవేర్చి సర్ ప్రైజ్ చేసింది. నాన్న చిరకాల కోరికను తీర్చేందుకు తొలి జీతం మొత్తాన్ని ఖర్చు చేసిన ఆమె ప్రేమకు వెలకట్టలేమని నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.
బీహార్లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..
తమిళ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ దళపతి విజయ్పై అభిమాని కేసు ఫైల్ చేశాడు. మదురైలో జరిగిన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) కార్యక్రమంలో తనపై విజయ్ బౌన్సర్లు దాడి చేశారని శరత్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గర్భిణీని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మేడిపల్లి కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భార్య స్వాతిని ఆ కారణంతోనే అతి కిరాతకంగా చంపినట్లు హంతకుడు మహేందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు.
నువ్వే నా ప్రాణం.. సర్వస్వమని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న అతడు.. కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టుకున్నాడు. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.