Home » Trains
అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న 56 మంది యువతులను కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దుర్మార్గానికి పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ మధ్య ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక, పర్యాటక టూర్ల కోసం వివిధ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. మీకు వెళ్లాలని మనసులో ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేమని వెనకేస్తున్నట్లయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇ-కామర్స్ సైట్లలో లాగే రైలు టికెట్లనూ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వందే భారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.
నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాజస్థాన్ జోధ్పూర్లోని భగత్కీకోటికి ఎక్స్ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో నగరవాసులకు అత్యంత కీలకమైన రవాణా సాధనంగా ఉంది. కానీ తాజాగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు నడిచే మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైళ్ల షెడ్యూల్లో ఆటంకం ఏర్పడింది.
నగర రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లలో కొత్త ఆఫర్లు కరువయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ప్రత్యేక రాయితీలను అందుబాటులోకి తీసుకురాలేదు. మెట్రోను అధికంగా వినియోగించే వారు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు.
వివిధ మార్గాల్లో నడిచే 54 ప్రత్యేక రైళ్లను అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 ప్రత్యేకరైళ్లు, హైదరాబాద్-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్-కన్యాకుమారి మార్గంలో 07230/07239 ప్రత్యేకరైళ్లను పొడిగించినట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
Trains Schedule: కేకే లైనులో సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కిరండూల్ రైళ్లతోపాటు హిరాకుడ్, సమలేశ్వర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటు కొరాపుట్ వరకే నడిపిస్తున్నామని సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు.
డీజిల్ ట్యాంకర్ల లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొని నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది...