Home » Thummala Nageswara Rao
పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
ఆలస్యంగా విధులకు హాజరైతే ఉపేక్షించబోమని వ్యవసాయశాఖ, అనుబంధ కార్పొరేషన్ల అధికారులు, ఉద్యోగులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు.
వినాయక చవితి పండుగ పనులు మానుకొని మరీ యూరియా కోసం క్యూలైన్లలో ఓపిగ్గా నిల్చున్నారు రైతులు! ఎప్పటిలాగే తమ వంతు వచ్చేసరికి సరుకు నిండుకోవడం వారిని ఆగ్రహం తెప్పించింది.
రైతులకు రుణమాఫీ చేసినట్లే నేత కార్మికుల రుణాలను క్యాబినెట్లో చర్చించి త్వరలోనే మాఫీ చేస్తామని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, వాస్తవాలను దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇక్కట్లను తీర్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరా గురించి నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని మనోహ్మన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఆకర్షణీయమైన డిజైన్లో నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో సాగుకు సరిపడా యూరియా కేటాయించాలని వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి లేఖలు రాస్తున్నా, ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అరకొరగానే యూరియాను సరఫరా చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.