Home » TGSRTC
గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు దసరా పండగ సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని గ్రేటర్ ఈడీ ఎం. రాజశేఖర్ తెలిపారు.
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ ఆర్టీసీ తోడ్పాటు అందించనుంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో లాభాల బాటలో పయనిస్తున్న టీజీఎ్సఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టిసారిస్తోంది.
ఐటీ కారిడార్లో ఎలక్ర్టిక్, మెట్రో డీలక్స్ బస్సులను ప్రముఖ ఐటీ సంస్థలకు అద్దెకిచ్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో వేలసంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు వినియోగిస్తే ఐటీకారిడార్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.
ఆర్టీసీ బస్ డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో సెల్ఫోన్లు వినియోగించకుండా నిషేధించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఆర్టీసీలోని కొందరు అధికారుల తీరు ప్రయాణికులపై అదనపు భారం మోపుతోంది. పల్లె వెలుగు బస్సులకు ఇష్టానుసారంగా ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి తిప్పుతూ ప్రయాణికుల నుంచి ఆమేరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్కు వెళ్లే 89 ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్జీఐఏ బోర్డింగ్ పాయింట్కి వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటి విడతలో భాగంగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.