TGSRTC: నేత్రదానానికి ఆర్టీసీ తోడ్పాటు!
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:20 AM
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ ఆర్టీసీ తోడ్పాటు అందించనుంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది.
బస్సుల్లో ఉచితంగా కార్నియాల తరలింపు
సరోజినీదేవి కంటి ఆస్పత్రితో ఆర్టీసీ ఒప్పందం
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ ఆర్టీసీ తోడ్పాటు అందించనుంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘నెట్వర్క్ టు సైట్’ పేరుతో సరోజినీదేవి కంటి ఆస్పత్రితో ఒప్పందం చేసుకుంది. మెహిదిపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. పవిత్రమైన ఈ దాతృత్వ కార్యక్రమంలో ఆర్టీసీ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఏటా 3 లక్షలకుపైగా మంది నేత్రాల కోసం ఎదురుచూస్తుంటే.. కేవలం 18 వేల మార్పిడిలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. మరణాంతరం నేత్రదానం చేేసందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.