Home » TGSRTC
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఒక పూర్తి స్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులకు యజమానులయ్యే అవకాశాన్ని ఇస్తోంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మొత్తం 600 బస్సులు అందించనుంది.
బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్కు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ప్రసాద్గౌడ్ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్, మెదక్, బాలానగర్ల మీదుగా హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్కు చేరుతుందన్నారు.
నగరంలో డీజిల్ బస్సులను తగ్గిస్తూ ఈవీ బస్సులను పెంచేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. రెండేళ్లలో మూడు వేల ఎలక్ర్టిక్ బస్సులు నడపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ జోన్లో ఇప్పటికే 265 ఈవీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుతోంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ హైదరాబాద్-1 డిపో(Hyderabad-1 Depot) నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిపో మేనేజర్ ఎం.వేణుగోపాల్ తెలిపారు.
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన విషయంలో అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎ్సలను నాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మీ పథకం తెలంగాణలో సూపర్ సక్సెస్ అయింది. ఈ పథకం కారణంగా.. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.
కొత్తగా 10 ఆర్టీసీ డిపోల ఔటర్రింగ్ రోడ్డు లోపల శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. మేడ్చల్, రంగారెడి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.
సద్దుల బతుకమ్మ ఈనెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.