Home » TGSRTC
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హైదరాబాద్ సిటీ బస్సులు కేటాయించారు. రేపటి నుంచి మహా జాతర జరగనుంది. అయితే.. నగరంలోని ఆయా డిపోల నుంచి సిటీ బస్సులను కేటాయించారు. సిటీ బస్సులను ఆయా డిపోలకు కేటాయించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భూపాలపల్లి డిపో పరిధిలో మొత్తం నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ హిందు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
మహిళలకు ఆర్ధిక చేయూత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా నగరంలోనొ ఆయా ఏరియాల్లో ఎలక్ర్టిక్ బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఆ బస్సులను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు.
తెలంగాణలోని మేడారం జాతరకు రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి 4వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మేడారానికి వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.
టీజీఎస్ఆర్టీసీ.. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజ్లతో స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడుపుతోంది.ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో సిటీ బస్సులు తగ్గాయి. దాదాపు 500 బస్సులను జిల్లాలకు తరలించారు. దీంతో నగరంలో సిటీబస్సులు తగ్గిపోయాయి. సంక్రాంతి పండుగ సెలవులు రావడం, శని, ఆదివారాలు కూడా పాఠశాలలకు సెలవులే కావడంతో చాలామంది ఇంకా ఊర్లల్లోనే ఉండిపోయారు. దీంతో నగరంలో బస్సులను తగ్గించారు.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.