Home » TG Politics
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు.
ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనోటీసులపై షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు.
కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని తలపెట్టిన వీబీజీ రాంజీ స్కీం పట్ల నిరసన తెలపాలని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తమ నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు.
తెలంగాణలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ‘సర్’ ప్రక్రియను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది.
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
మోదీ హయాంలో దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యవసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారని హెచ్చరించారు.
జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీకి లీడర్స్ ఉన్నారు.. కేడర్ ఉందని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.