Home » TG Politics
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి హరీష్రావు చెప్పుకొచ్చారు. తమ వ్యతిరేక పార్టీలు మామీద ఎలాంటి కామెంట్లు చేశాయో... కవిత కూడా అలాంటి కామెంట్లను తనమీద చేశారని విమర్శించారు. ఎరువుల కొరత వరద ప్రభావం ఇలాంటి సమస్యలతో రాష్ట్రం ఇబ్బంది పడుతోందని హరీష్రావు పేర్కొన్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పార్టీ..
కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.
మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని హరీష్రావు చెప్పుకొచ్చారు.
నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్లోనే కేటీఆర్ ఉన్నారు. పలు కీలక విషయాలపై కేసీఆర్తో చర్చిస్తున్నారు.
కేసీఆర్పై ఆరోపణలు చేస్తే.. తలదించుకోవాల్సింది సీఎం రేవంతే అని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తదననంతర పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీఆర్ఎస్లో సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.