Home » TG News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటూ బొల్లా కిరణ్ బ్రదర్స్ గంజాయి దందాకు తెరదీసినట్లు ఈగల్ అధికారులు గుర్తించారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ను రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు.. తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని అమలు చేయనుంది.
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్లోని JRC కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. సౌదీ అరేబియా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద నకిలీ టికెట్ను గుర్తించగా.. ఢిల్లీ వెళ్తున్న మరో ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.