Home » TG News
ఏడుకొండల వాడా వెంకటరమణ.. ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే స్వామి వెంకటేశ్వరుడు.
ఓ జువెల్లరీ షోరూంలోని సేల్స్ విభాగంలో శిక్షణ కోసం వచ్చిన ఓ యువకుడు రూ. 1.65 కోట్ల విలువ గల బంగారు బిస్కెట్లు చోరీ చేసి పరారయ్యాడు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ల్యాప్టాప్ల చోరీ కేసులో విద్యార్థులే దొంగలుగా తేలింది. ఓ ఐటీ కంపెనీకి గంపగుత్తగా అమ్మాలని పథకం వేసి తాము చదువుతున్న ఇనిస్టిట్యూట్లోని కంప్యూటర్లను చోరీ చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఓ ట్రేడింగ్ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్సైట్ను హ్యాక్ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 14, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, బజ్జిమిర్చి 32లకు విక్రయిస్తున్నారు.
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు గాయత్రిహిల్స్ ఫీడర్ పరిధిలో కరెంట్ ఉండదని తెలిపారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించి కొకైన్ ముఠా దందాను గుట్టురట్టు చేసింది. ఈ ఆపరేషన్లో 32 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకుని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు..
శంషాబాద్ ప్రాంతాన్ని హైస్పీడ్ రైళ్ల హబ్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ .....
మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. అయితే, హంగ్ నెలకొన్న మునిసిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయి.....
నేనే రాజు.. నేనే మంత్రి’ అని తాను చెప్పిన విషయాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాము పాలకులం కాదని, సేవకులమని, ఈ విషయాన్ని తాను ఏనాడో చెప్పానని తెలిపారు.