Home » TG News
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించవద్దని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నాలుగువారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీచేసింది.
హైకోర్టు స్టే ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపింది.
పట్టణ గృహనిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో చేపట్టదలచిన ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల మార్పులు, పేర్ల మార్పులకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని దిశానిర్దేశం చేశారు.
మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు అప్పగించే సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉందని కొనియాడారు.
ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులను ఆగస్టు 13వ తేదీన సన్మానిస్తామని తెలంగాణ మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయిందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.