Home » TG Govt
సంక్రాంతి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు.
తెలంగాణలో 2025లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు గతంతో పోలిస్తే అత్యంత వేగంగా పెరిగాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నిమిత్తం ప్రశ్నోత్తరాల సెషన్ జరుగుతుంది.
కేసీఆర్ ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా చేసుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. అయితే సీఎం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో సీఎం నారా చంద్రబాబునాయుడు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని ఏపీ సర్కార్ చెబుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ముంబై పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీతో సమావేశం కానున్నారు.
కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నానని అన్నారు..
తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని.. అయిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపణలు చేశారు.