Home » TG Govt
గోడౌన్లో సీజ్ చేసిన లిక్కర్తో పాటు, రైల్వే షిప్పింగ్ మెటీరియల్ కూడా ఉందని డీఎఫ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించని సీజ్ చేసిన మెటీరియల్ను కస్టమ్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచారని చెప్పారు.
బాగ్ అంబర్పేట్కు చెందిన ఓ వృద్ధురాలికి ఈనెల ఆకాష్ చౌదరి పేరిట ఫోన్ కాల్ వచ్చింది. 187 మంది చిన్నపిల్లల అక్రమ రవాణా, హత్య కేసులు వృద్ధురాలిపై ఉన్నాయని సైబర్ నేరగాడు భయపెట్టాడు. తనని అరెస్టు చేసేందుకు బెంగళూరు నుంచి వస్తున్నట్టు వృద్ధురాలిని ప్రలోభ పరిచాడు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పలు కీలక సూచనలు చేశారు.
కేసీఆర్ గత ప్రభుత్వంలో మాదిరిగా సరకుల సప్లైయర్స్ వ్యవహారిస్తే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చి బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి సీతక్క ఆజ్ఞాపించారు.
శనివారం నుంచి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేయాలని కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు.. గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
కర్నూలు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి - భోంగిర్, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నేడు ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.