Home » Telangana
జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో బస్టాండ్ల నిర్మా ణం చేపట్టక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో పదిహేను మండలాల పరిధిలో కేవలం ఆసిఫాబాద్, కాగజ్నగర్, కౌటాల మండలాల్లో బస్టాండ్లు ఉన్నాయి. మిగితా మండలాల్లో కొన్నిచోట్ల కేవలం షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూర్(టి), దహెగాం, రెబ్బెన, కెరమెరి, తిర్యాణి వంటి మండలాల్లో బస్టాండ్లు లేని కారణంగా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు.
జిల్లాలోని ప్రతి రైతు నుంచి రైతు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో జిల్లా వ్యవసాయాధికారి వెంకట్తో కలిసి మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలుతో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, యాప్ ద్వారా యూరియా స్లాట్ బుక్కింగ్ అంశాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృమాలలో విద్యను అభ్యసిస్తున్త విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికకాహారం అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. మండలంంలోని మోడి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు.
కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ పాలక వర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సమస్యల పరిష్కారం, అభివృద్ది పనులు, అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి ఎజెండగా ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చి గెలు పొందిన వార్డు కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు కొలువు దీరిన నూతన పాలకవర్గా లకు స్వాగతం పలుకుతూ సవాలుగా నిలుస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు. L1 కింద 4,800 మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను మహేశ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.