Home » Telangana
రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న పాలకులు పలు పథకాలను వారి దరికి చేర్చడంలో విఫలమవుతు న్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె ప్రజలు, రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వ్యవసాయంతో పాటు అనుంబంధ రంగమైన పశువుల పెంపకం రైతుల జీవనోపాధిలో భాగమైంది. వ్యవసాయాఽధారిత గిరిజన జిల్లాలో చాలా మంది పశువుల పెంపకతో ఉపాధి పొందుతున్నారు.
జిల్లాలో స్వయం సహాయక మహిళ సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. తిర్యాణి మండలంలోని విజయనగరం కాలనీలో శుక్రవారం జంగులబాయి మండల సమాఖ్య భవనాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయ మహిళ సంఘాలు ఆర్థికంగా బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)లో ఓటర్లు వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ‘సర్’ సహాయత కేంద్రాన్ని ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. సర్ ఫారాలను నింపడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లేనిచో ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రస్తుతం డిజిటల్ యుగమే నడుస్తున్నప్పటికీ సైబర్ నేరాల భయం ఉన్న వారు, వయో వృద్ధులతో పాటు ఎంతో కొంత నగదు కావాల్సిన వారు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లడమో, ఏటీఎం వద్దకు వెళ్లడమో చేయాల్సిందే. లైన్లలో నిల్చోవాల్సిందే. ఖాతా తెరవాలన్నా, నగదు కావాలన్నా, బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బం దులు తొలగేలా తపాలా శాఖ ఇంటి వద్దకే వచ్చి పలు రకాల సేవలు అందిస్తోంది.
ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు మండల కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారు ఇద్దరు.. వారికి ఇద్దరు! సొంతిల్లు ఉంది! బియ్యం వ్యాపారంలో భర్త బిజీ! ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కుమారులు, అత్తగారి బాగోగులను చూసుకోవడమే..
ఐదు దశాబ్దాల పాటు విప్లవ పార్టీల గొంతుకై.. తన ఉద్యమగళంతో ప్రజ ల్లో చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని నింపిన ‘అరుణోదయ’ నాగన్న ఇకలేరు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్ను తప్పుదారిలో తీసుకెళ్లిన సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డిని ఉన్నతాధికారులు వీఆర్కు అటాచ్ చేశారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం ‘రికార్డు’ నెలకొల్పింది. దేశంలో కేరళతో సమానంగా ప్రథమ స్థానాన్ని సాధించింది.
తెలంగాణలో ఎగుమతుల బలోపేతానికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు.