Home » Telangana
నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్హౌస్లను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందని ఆగ్రహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్హౌస్ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా మరి కొన్ని జిల్లాల్లో రెండ్రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వరంగల్ పర్యటనకు వెళ్తుండగా భువనగిరి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్లో హరియాణా పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో దోపిడీ కేసుకు సంబంధించిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయ్యాయని ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ కోచ్ ఫ్యాక్టరిని ప్రారంభిస్తామని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.
ఇదీ.. అదీ అని లేదు.. అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి మొదలుకుని కోడిగుడ్డు వరకు అన్నింటికి రెక్కలు వచ్చాయి. తాజాగా కోడిగుడ్డు ధర ఎనిమిది రూపాయల వరకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు ఇసుక ధర ట్రాక్టర్కు ఏడు వేల రూపాయలకు చేరింది. దీంతో ఇళ్లు నిర్మించుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగి నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక ధర పెరగడంతో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉక్కిరిబిక్కరవుతున్నారు.
ప్రతీ పౌరుడికి ఓటుహక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఈలక్ష్యంతో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ గత నెల 25న ప్రారంభమైంది. అయితే తమ అనుకూల ఓట్లను రద్దు చేసేందుకు సర్ను నిర్వహిస్తున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి.