Home » Telangana
ఎన్నికల నాడు ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి వసతులు కల్పించడంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు విఫలమయ్యారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లు, ర్యాంపులు కనిపించలేదు. ఫలితంగా వృద్ధులు, వికలాంగుల అవస్థలు చెప్పలేనివి. తాగునీటి సదుపాయం కూడా అంతంతే.
Telangana: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో..
Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్లో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Telangana: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నా ఫలితాలు రావడం లేదన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కల్లాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
డబ్బు కోసం ఏకంగా భర్త, అత్తపైనే దాడి చేయించిందో మహిళ. అత్తను చంపేస్తే ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించింది. మానవత్వం మరచి.. తన తరుఫు బంధువులను అరేంజ్ చేసి మరీ కొట్టించిన ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టేల మండి సమీపంలో భర్త, అత్తపై బంధువులతో భార్య దాడి చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు.
Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.
Weather Alert to AP and TS: ఎండలతో సతమతం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు. ఒక్కసారిగా కురుస్తు్న్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది.
Telangana: శంకర్పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో అనుమానాస్పద రీతిలో యువతి శరీరం కాలిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న లేఖ్య అనే విద్యార్థి యాసిడ్ దాడికి గురైనట్లు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.