Home » Telangana
నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్ ఏర్పాటైంది. జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు, జవహర్నగర్, కాచిగూడ కేసుల్లో పరారీలో ఉన్న నేపాలీలను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడిన వాటర్బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్కు బోర్డులో ఉలుకరూ.. పలుకరూ అనే పేరుంది.
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు.
హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి.
అర్హులైన పేద ప్రజలందరికీ సొంత ఇల్లు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లుతోంది.
ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయనిధి నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ప్రభుత్వం పారదర్శకత పెంచేలా సీఎంఆర్ఎఫ్ మఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తుల్లో మార్పులు తీసుకువచ్చింది. ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలిచే మఖ్యమంత్రి సహాయనిధి నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ముఖ్యంగా దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు పారదర్శకత పెంచే లక్ష్యంతో ధరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేపట్టింది.
జిల్లాలో ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేయక పోవడంతో రైతులకు ఏళ్లతరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. కొద్దిపాటి నిధులు మంజూరు చేస్తే వేలాది ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలోని ప్రాణహిత, పెన్గంగ నదుల వద్ద నిర్మించిన ఎత్తి పోతల పథకాలు ఆయకట్టుకు చుక్కనీరందించడం లేదు.
జైనూర్లో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో ఏజెన్సీ మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ గోదాంలో మార్క్ఫెడ్ ఆద్వర్యంలో సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. వీటితో పాటు సాయిబాబా అగ్రో సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అంబలి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి ఆత్రం సుగణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
జిల్లా లో సాగయ్యే పంటల్లో ప్రధానమైనది పత్తి పంట.. వచ్చే వానాకాలానికి సంబంధించి పత్తి విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. గతేడాది నిర్ణయించిన ధరలే కొనసాగేలా చర్యలు చేపట్టింది. దీంతో పత్తి రైతులకు ఊరట లభించింది. ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జిల్లాలో సాగుతోంది