Home » Telangana
గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం ఇప్పుడు వనితలు కొట్లాడుతున్నారని పేర్కొన్నారు..
హిందూ దేవుళ్లనే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు..
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..
ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.
అమీర్పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్ప్రెస్ (12793 నంబర్) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
పోస్టల్ సేవలు నిరంతరాయంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయి. తపాలశాఖను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది.