Home » Telangana
కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, గుడిలో ప్రమాణం చేస్తామనని కాంగ్రెస్ నేత తెలిపారు.
నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు.
చికెన్ సెంటర్ల బంద్ విజయవంతమైంది. బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చా యి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి.
బడంగ్పేట్ అవనీతి కేసులో అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.
మిత్రుడి వివాహ విందుకు హాజరై తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసింది.
హైదరాబాద్లో ఎనిమిది నెలల పసికందు మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చిన చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందింది.
హైదరాబాద్ నగరంలో ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు బ్లూకోట్స్, పెట్రోలింగ్ వాహనాలతో రాత్రీపగలు (24/7) పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
భారీ వడ్డీ పేరుతో సుమారు 290 మంది నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మైలార్దేవ్పల్లి శాస్ర్తిపురంలోని 6500 చదరపు గజాల క్రీడా మైదానంలో ఆక్రమణలను బుధవారం తొలగించింది.