Home » Telangana Police
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆగడాల నుంచి రక్షించేందుకు మహిళలు, పిల్లల భద్రత కోసం నిత్యం షీ టీమ్స్ పహారా కాస్తున్నాయి. తాజాగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 70 మంది అరెస్టయ్యారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ను.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దింపారు.
ఇంటర్ విద్యార్హతతో పోలీసు ఉద్యోగాల్లో చేరిన వారు ఇకపై డిగ్రీలు అందుకోవచ్చు. ఐదేళ్లలో పట్టభద్రులై పట్టాలు పుచ్చుకోవచ్చు. ఉన్నత చదువులు చదువుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈనెల 14న రాత్రి 8 గంటలకు వరిగుంతం వద్ద కాంగ్రెస్ కీలక నేత అనిల్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
Police Investigation: సీపీఐ నేత చందు నాయక్పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు గుర్తించారు. భూతగాదాల వల్లే సీపీఐ నేతపై కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై బీఆర్ఎస్ వర్గాలు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో రాష్ట్ర పోలీసు విభాగం అప్రమత్తమైంది.
Excise Police Ganja Raid: నగరంలోని దూల్పేటలో రోహన్ సింగ్ అనే వ్యక్తి కొత్త పంథాలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడ్డాడు. ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చిన అతడు.. దానికి పూజలు చేశారు. రోహన్ సింగ్ వద్ద గంజాయి ఉన్నట్లు పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించారు.
CM Revanth Child Protection: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ ‘భరోసా’ ప్రాజెక్టును తీసుకొచ్చిందని.. అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.