Home » Telangana Police
ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
తెలంగాణలో 2025లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు గతంతో పోలిస్తే అత్యంత వేగంగా పెరిగాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్ సమీపంలో ఉన్న సెల్ టవర్ను ఓ వ్యక్తి ఇవాళ (శనివారం) ఎక్కాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
భాగ్యనగరంలోని నానక్రామ్గూడలో ఈగల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్రెడ్డిని అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.
హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మావోయిస్టులకు వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సె దేవా, 15 మంది మావోయిస్టులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.
దేవీదేవతలపై యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్వేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణలో వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి.
కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ వచ్చే లింక్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్లో 2011లో చోటుచేసుకున్న దారుణ హత్యకేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్ (అలియాస్ కమ్మ సింగ్)కి మరణశిక్ష విధించింది.