Home » Telangana Police
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్కు చెందిన రేణుక పని చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆగడాల నుంచి రక్షించేందుకు మహిళలు, పిల్లల భద్రత కోసం నిత్యం షీ టీమ్స్ పహారా కాస్తున్నాయి. తాజాగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 70 మంది అరెస్టయ్యారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ను.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దింపారు.
ఇంటర్ విద్యార్హతతో పోలీసు ఉద్యోగాల్లో చేరిన వారు ఇకపై డిగ్రీలు అందుకోవచ్చు. ఐదేళ్లలో పట్టభద్రులై పట్టాలు పుచ్చుకోవచ్చు. ఉన్నత చదువులు చదువుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈనెల 14న రాత్రి 8 గంటలకు వరిగుంతం వద్ద కాంగ్రెస్ కీలక నేత అనిల్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
Police Investigation: సీపీఐ నేత చందు నాయక్పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు గుర్తించారు. భూతగాదాల వల్లే సీపీఐ నేతపై కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.