Home » Telangana Police
వికారాబాద్ జిల్లాలో లంచం కేసు తీవ్ర కలకలం రేపింది. తాజాగా జరిగిన పరిణామాల ప్రకారం.. వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల అనంతరం తీసుకున్నారు.
తెలంగాణలో పెద్ద ఎత్తున సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పరిపాలనలో కీలక విభాగాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పోలీసు శాఖలో వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ జరిగిందని భావిస్తున్నారు.
హైదరాబాద్లో మాదకద్రవ్యాల కట్టడిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన మెరుపు దాడిలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. మౌలాలి పారిశ్రామిక వాడ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను అధికారులు ఛేదించి, కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
ప్రముఖ గాయని మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు డీజీపీని సోమవారం అడ్వకేట్ కలిశారు.
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నాచారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి జరిపారు. పారిశ్రామిక ప్రాంతాలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రోడ్డు భద్రతపై ప్రజలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. మనల్ని మనం కాపాడుకుందామనుకునే లోపే ప్రమాదం జరిగిపోతుందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది. వృద్ధురాలిపై రోకలిబండతో దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.