Home » Telangana Govt
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
సింగూరు డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించింది. డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది.
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా ఆస్తినష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వరదల్లో నష్టపోయిన కుటుంబాల కోసం ప్రభుత్వం తక్షణ సాయం కింద నిధులను విడుదల చేసింది.
ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్భవన్ దర్బార్ హాల్ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లును అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రధాన న్యాయమూర్తి అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై గురువారం లేదా శుక్రవారం సుప్రీం ధర్మాసం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల రామంతాపూర్లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కస్టడీకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
HCA Scam Investigation: బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు గోల్మాల్పై జగన్మోహన్ రావుతో పాటు నిందితులను సీఐడీ విచారిస్తోంది. శ్రీ చక్ర క్లబ్ ఏర్పాటు , ఫోర్జరీ చేసి ఎన్నిక అయిన విధానంపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Banakacharla Project Controversy: బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రేవంత్ సర్కార్.
Sigachi Industrial Accident Investigation: సిగాచి ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో సిగాచి ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ రావు అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.