తెలంగాణలో ఉద్యోగులకు రూ.1000 కోట్ల బకాయిల విడుదల
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:41 PM
తెలంగాణలో ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థికశాఖ రూ.1000 కోట్లను రిలీజ్ చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణలో ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం(Telangana Government) విడుదల చేసింది. బుధవారం ఆర్థికశాఖ రూ.1000 కోట్లను రిలీజ్ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను సర్కార్ చెల్లించింది. దీంతో 2025 అక్టోబర్ వరకు బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసింది. గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు ప్రతి నెల ఉద్యోగుల బకాయిల కోసం ప్రభుత్వం రూ.700 కోట్ల చొప్పున చెల్లిస్తూ వస్తోంది.
ఈనెల(ఏప్రిల్) బకాయిల చెల్లింపులను రూ.700 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెంచింది. మిగిలిన ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే నెలకు వెయ్యి కోట్ల చెప్పున విడుదల చేస్తూ బకాయిలన్నింటీని క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగుల మెడికల్ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ప్రభుత్వం చెల్లిస్తోంది.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి
రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News