Home » Telangana Govt
Telangana: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.
తెలంగాణ సర్కార్ మద్యం ధరల పెంపునకు సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.
తెలంగాణలో దసరానాడు ముక్క, సుక్క లేకుండా పండగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.
Telangana: రాజకీయ నాయకులు పరుశపదజాలం వాడడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. కొందరు ఇష్టమున్నట్టు మాట్లాడితే తనలాంటి వాడికి ఇబ్బందిగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వాడే పదజాలం పద్ధతిగా ఉండాలని సూచించారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్కు గర్నవర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైడ్రా ఆర్డినెన్స్కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్పై సంతకం చేసిన..
Telangana: ఖాళీ చేసిన ఇళ్లను ఇప్పటి వరకు అధికారులు కూల్చివేశారు. అయితే కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించినప్పటికీ ఖాళీ చేయని పరిస్థితి. హైదరాబాద్ శివారులో డబుల్ బెడ్రూంలు కేటాయించారని.. ఒక్కో ఇంట్లో 16 మంది ఉన్న వారికి డబుల్ బెడ్ రూంలు ఏం సరిపోతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Telangana: మెడికల్ అడ్మిషన్లకు స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ఎన్ఆర్ఎస్సీ, వాతావరణ శాఖ విచారణ చేపట్టింది. అడవుల్లో వాతావరణ పరిస్థితులను ఎన్ఆర్ఎస్సీ నమోదు చేసుకుంది. 2018 జనవరి 22న మేడారంలోని చిలకల గుట్టలో టోర్నడోలాంటి సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఆనాడు సుడిగాలి ఫోటోలను ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ వీరగోని హరీష్ క్యాప్చర్ చేశారు.
సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి.. ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే.. అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది.