Home » Telangana BJP
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
తెలంగాణకి రెండు కేంద్రమంత్రి పదవులు ఇస్తే ఓ బీసీకి మంత్రి పదవి ఇచ్చామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ 68 మంది సీఎంలను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని రఘునందన్ స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్, బండి సంజయ్ల విషయంలో బీజేపీ కేంద్ర హై కమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని.. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. ఆయన సస్పెండ్ కాలేదని.. రిజైన్ చేశారని గుర్తుచేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చని ఎంపీ అరవింద్ సూచించారు.
తెలంగాణ కులగణన, రిజర్వేషన్లు దేశానికి దశ దిశ చూపుతాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. బీసీ సర్వే మొదలు పెట్టినప్పుడు కొంతమంది అవసరం లేదన్నారని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన సర్వే నిదర్శనంగా నిలిచిందని నొక్కిచెప్పారు.
మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని.. వీరుడు ఎక్కడా భయపడడని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల అంశాలు పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని ఈటల చెప్పుకొచ్చారు.
రేవంత్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని నిలదీశారు. బీసీలకు మీరిచ్చేది కేవలం ఐదు శాతమేనని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్రెడ్డి మంత్రివర్గంలో తీర్మానం చేయడం బీసీలను మరోసారి మోసగించడమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్రెడ్డి సర్కార్కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వం.. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప దేశ ప్రజలకు చేసిందేమి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు శుక్రవారం రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానా స్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు.