Home » Team India
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవరి నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీస్ షార్ట్ లిస్ట్ జాబితాలో జైస్వాల్కు చోటుదక్కింది.
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు సన్నాహాకాలు కూడా మొదలుపెట్టారు.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 22 నుంచే ఈ ధనాధన్ లీగ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్కు ముందు టీమిండియా ఆడే చివరి మ్యాచ్ ఇంగ్లండ్తో ఆడే ఐదో టెస్టే. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఐపీఎల్ మూడ్ వచ్చేసింది.
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలవడం ప్రస్తుతం టీమిండియాకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం గుజరాత్లోని జామ్నగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానంటూ వస్తున్న వార్తలను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖండించారు. తాను ఎన్నికల బరిలో నిలవడం లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడంటూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నేపాల్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్లో నెదర్లాండ్స్ బ్యాటర్లు మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్ ప్రపంచరికార్డు నెలకొల్పారు. నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ బ్యాటర్లు పరుగుల వరద పారించారు.
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. టీ20 ప్రపంచకప్నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఐసీసీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై హనుమ విహారీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఓ రాజకీయ నాయకుడి కోరిక మేరకే రంజీ ట్రోఫీలో తనను కెప్టెన్సీ తప్పించారంటూ విహారీ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్ ద్వారా వీరిద్దరు తమ తమ వ్యక్తిగత కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని చేరుకోబోతున్నారు.