Home » Tamilaga Vettri Kazhagam
ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చారిత్రకం కానున్నట్టు తెలిపింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి ప్రచార అస్త్రంగా టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు మంగళవారంనాడు బహిరంగ లేఖ రాశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రధాన పార్టీలతో తలబడుతున్న టీవీకే చీఫ్ విజయ్కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లతో వ్యత్యాసాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విజయ్కు నోటీసులు జారీ చేసింది.
తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలన అనేది సినిమా కాదని, ఇందులో రీటేక్స్ ఉండవని అన్నారు. శివగంగలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో చిదంబరం ప్రచారం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తిరునల్వేలిలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో టీవీకే చీఫ్ విజయ్ పాల్గొన్నారు. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు 'పూర్తి అధికారాలు' ఉంటే ఈరోజు తిరునల్వేలిలో ఈ సభ జరిగుండేది కాదని అన్నారు.
కేంద్రంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని బీజేపీ, కాంగ్రెస్పై టీవీకే చీఫ్ విజయ్ విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరికి చట్టబద్ధంగా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించేందుకు టీవీకే నూటికి నూరు శాతం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి.. తమ నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
తనకు రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో విజయ్ పేర్కొన్నారు. తన భార్య సంగీతకు రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు తెలిపారు.
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సోమవారంనాడు నామినేషన్ వేశారు. తూర్పు తిరుచ్చి నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం హామీ ఇచ్చింది.