Home » Tamil Nadu
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పరిసరాల్లో కేరళ ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. ఎన్నికల వేళ 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' పార్టీని స్థాపించిన వీకే శశికళ తాజాగా ఎస్.రామదాస్ సారథ్యంలోని పాట్టాలి మక్కల్ కట్చితో పొత్తు పెట్టుకున్నారు.
గత ఐదేళ్ల డీఎంకే పాలనలో మహిళలకు భద్రతలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల్లో ముగ్గురు మాజీమంత్రులు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు.
సాధారణంగా ఓ గ్రామం ఏదేని ఒక పంచాయతీలో గానీ, లేదా ఒక శాసనసభ నియోజకవర్గంలోగానీ ఒక లోక్సభ నియోజకవర్గంలో గానీ వుంటుంది.
తిరునల్వేలి జిల్లా పడమటికనుమల ప్రాంతానికి చేరువగా మణిముత్తారు డ్యామ్ నుండి సుమారు30 కి.మీ.ల దూరంలో మాంజోలై ప్రాంతం ఉంది. అక్కడి నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో నాలుముక్కు, అక్కడి నుండి 10 కి.మీ.ల దూరంలో ఊత్తు ప్రాంతం ఉన్నాయి.
ఆదవ్ అర్జున్ ఎవరో తనకు తెలీదని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసి ఆ పార్టీ నుండి వైదొలగిన ప్రముఖ నటి రంజనా నాచ్చియార్ గురువారం డీఎంకేలో చేరారు.
సూపర్స్టార్ రజనీకాంత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు. రజనీని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఆ వివాదం చాలా విచారం కలిగించిందని అన్నారు.