Home » Tamil Nadu
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్ ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు స్టార్ హీరో అజిత్ కుమార్, నటులు అరవింద్ స్వామి, ఖుష్బూల నివాసాలకు ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు
అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి అన్నారు.
గంజాయిని బిస్కెట్ల రూపంలోకి మార్చి పోలీసు కళ్లుగప్పి విక్రయాలు చేపడుతున్న 42యేళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా.. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు ఎస్టేట్ సమీపంలో తనిఖీలు చేస్తు న్న పోలీసులు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను ఆపి ఆమె బ్యాగు తనిఖీ చేశారు.
హీరో విశాల్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో గత కొంతకాలంగా సాగుతోంది.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు.
తెలియని వారికి ఎస్ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ తన జన్మదినం సందర్భంగా టీటీడీలో ఒక రోజు అన్నదానం కోసం రూ.44 లక్షలు కేఎన్ నెహ్రూ విరాళంగా అందజేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రేషన్కార్డు దారులకు పొంగల్ కానుకగా రూ. 5వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు.