New Year: న్యూ ఇయర్ ఎఫెక్ట్ .. మల్లెపూలు కిలో రూ.3,000
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:49 PM
మల్లెపూలు కిలో రూ.3 వేలంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్పిందేమరి. నూతన సంవత్సరం మల్లె రైతులను, వ్యాపారులకు ఆదుకుందని చెప్పవచ్చు. రాజధాని నగరం చెన్నైతోపాటు ముఖ్య పట్టణాల్లో కిలో మల్లెపూలు రూ. 2,500 నుంచి రూ. 2 వేల వరకు విక్రయించారు.
చెన్నై: నూతన సంవత్సరం కారణంగా ఒక్కరోజులో మల్లెలు సహా అన్నిరకాల పూల ధరలు పెరిగాయి. పూల మార్కెట్లలో మల్లెపూలు కిలో రూ.3,000లకు చేరుకున్నాయి. నూతన సంవత్సరం, పూల దిగుబడి తక్కువగా ఉండడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. మదురై(Madhurai) మార్కెట్లో బుధవారం మల్లెలు కిలో రూ.2,500, తేని జిల్లా ఆండిపట్టి మార్కెట్లో రూ.3,000 ధర పలికాయి. అలాగే, కనకాంబరం రూ.2,500, ముల్లై పూలు రూ.1,200, సెవ్వంతి రూ.120, గులాబీ రకాలు రూ.200 వరకు పెరిగాయి.

ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News
