Home » Tamil Nadu
తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్లోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చని జిల్లా యంత్రాంగం తెలిపింది.
తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలోని మణలి ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు సోమవారంనాడు ప్రకటించారు.
తమిళనాడులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా టీవీకే పార్టీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులోని మధురై నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలో 17 ఏళ్ల యువకుడిని ఆదివారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తమిళనాడులో డీఎంకే వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని, విజయ్ సారథ్యంలోని టీవీకేతో చేతులు కలిపి తమకు వెన్నుపోటు పొడిచిందని ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. డీఎంకే కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తమ పార్టీ వెన్నంటే ఉందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది.
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరకుల కోసం బయటకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం శుక్రవారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపింది. ప్రభుత్వంలో మరో ఇద్దరికి చోటు కల్పించింది. టీవీకేకు బయట నుంచి మద్దతిస్తామని ఇంతకుమందు ప్రకటించిన విడుదలై చిరుతైగళ్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధికార కూటమిలో చేరాయి.