Home » Tamil Nadu
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు కేటాయించేందుకు డీఎంకే నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే 40 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కనీసం 38 సీట్లయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బేరం పెట్టినట్టు చెబుతున్నారు.
ప్రజాసంక్షేమం కంటే వారసత్వ రాజకీయాలకే డీఎంకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రాధాన్యతనిస్తున్నాయని అమిత్షా విమర్శించారు.
ఆ ఏరియాలో చిరుతపులి సంచారం ఉందని, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు తెలుపుతున్నారు. కడలూరు సమీపం అరిసిపెరియంకుప్పం ప్రాంతంలో నయినార్ అనే రైతుకు చెందిన పొలంలో చిరుత కాలిముద్రలను గుర్తించారు.
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్లో వాహనాల ప్రవేశ రుసుమును రాష్ట్రప్రభుత్వం పెంచింది. బస్సులకు ప్రవేశ రుసుము రూ.250 వసూలుచేస్తుండగా రూ.300లకు పెరిగింది. అలాగే మిగిలిన వాహనాలకు కూడా పెంచారు.
ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కేరళ తీరం వెంబడి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ ఏడాది జరుగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం సంకేతాలు ఇచ్చింది..
తమిళనాడు రాష్ట్రంలోని కాశిమేడు తీరంలో బ్లూ డ్రాగన్ చేపలు పెద్దఎద్దున కనిపించాయి. అయితే.. వీటిని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో సముద్రం వద్దకు వచ్చారు. కాగా.. ఈ చేపల వల్ల హాని ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే గిప్ట్ ఈనెల 8వ తేదీ నుంచి అందించనున్నారు. రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.
హెల్మెట్ ఉన్న వారికి పొలీసులు వెండి నాణేలు అందజేశారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరమో వివరిస్తూ వెండి నాణేలను అందజేశారు. తంజావూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేలా జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.
మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.