Home » Supreme Court
14 ఏళ్ల బాలికకు సంబంధించి 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఎయిమ్స్ (AIIMS) వైద్యులు సుప్రీంకోర్టులో 'క్యూరేటివ్ పిటిషన్' దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.
మహిళా న్యాయవాదిపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది ప్రారంభంలో కోల్కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మధ్యలోకి ముఖ్యమంత్రి చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టటం సరికాదని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో జరుగుతున్న మతపరమైన హక్కులు, ఆచారాలు, ప్రభుత్వ జోక్యంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శబరిమల కేసు సంబంధిత విచారణలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది.
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలీంగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, అడ్వకేట్ ఆశిష్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనపై, తన కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది.