Home » Supreme Court
బీసీసీఐ నేతృత్వంలో ఏర్పడిన క్రికెట్ జట్టును టీమిండియాగా అభివర్ణించకూడదని, ఈ మేరకు ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాది రీపక్ కన్సల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
నమాజ్ చేసుకునేందుకు వచ్చే ముస్లిం కమ్యూనిటీ వ్యక్తుల జాబితాను జిల్లా యంత్రాంగానికి అందజేయాల్సి ఉంటుందని సీజేఐ సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్యా బాగ్చి, విపుల్ ఎం పాంచోలితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
వివిధ కేసులకు సంబంధించి పోలీసులు మీడియాకు ఇచ్చే సమాచారంపై నియంత్రణలు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో పోలీస్ మీడియా బ్రీఫింగ్ విధానాలు రూపొందించి అమలు చేయాలంది.
ఆరావళి నిర్వచనంపై గతంలో ఇచ్చిన తీర్పు, దానిపై వస్తున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
కేంద్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉంటే, రాష్ట్ర పోలీసులు లేదా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలు దర్యాప్తు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సీబీఐ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ఏజెన్సీ దాఖలు చేసిన చార్జ్షీట్ చెల్లుబాటు అవుతుందని, కేవలం కేంద్ర ఉద్యోగి అనే కారణంతో దాన్ని కొట్టివేయలేమని కోర్టు తెలిపింది.
వీధి శునకాల అంశానికి సంబంధించి తాము ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ చేసిన విమర్శలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమె కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ మండిపడింది..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా.. అంటూ సీబీఐని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీం కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశించినా.. మూడు నెలల గడువులోగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోలేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.