Home » Supreme Court
బెంగాల్ ప్రభుత్వం బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల రద్దుపై కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తన అరెస్టును సవాలు చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిగింది..
కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ను వినియోగించడం ద్వారా కలిగిన సైడ్ ఎఫెక్డ్స్ విషయమై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలలో టీచరు చేతిలో బెత్తం దెబ్బలు తిన్న అనుభవాన్ని ఇప్పటికీ మరిచిపోలేనన్నారు.
ఎన్నికల్లో ఒకే పేరున్న వ్యక్తులు ఒకే చోట నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. రాజకీయ నాయకుల పేర్లు ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా పోటీ చేయకుండా తాము నిరోధించలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పేర్కొంది. మే 7న పిటిషన్ను విచారిస్తామని తెలిపింది. వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదులకు జస్టిస్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని..
సీబీఐపై తమ కంట్రోల్ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తేల్చిచెప్పింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 131 ప్రకారం ఈ కేసు వేసింది.
న్యూఢిల్లీ: జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక విషయాలను సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించింది.
హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే సముచిత ఆచార వ్యవహారాల మధ్య వివాహ క్రతువు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.