Home » Supreme Court
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్టీఏను రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రస్తుత పెట్రోలియం సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యలపై నిర్దిష్టమైన రోజుల్లో వర్చువల్ తరహాలో కోర్టు ప్రొసీడింగ్స్ జరపనున్నట్టు ప్రకటించింది.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), కమిషనర్ల నియామక ప్రక్రియ తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు.
హిందూ మతం ఒక జీవన విధానమని, ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఆలయానికి వెళ్లడం, ఆచారాలను పాటించడం తప్పనిసరేం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బెయిల్ పిటిషన్ల లిస్టింగ్, విచారణలో పదేపదే జరుగుతున్న ఆలస్యం, కేసులు భారీగా పేరుకుపోతుండటంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
శబరిమల వివాదంలో ‘విశ్వాసం’, ‘రాజ్యాంగ నైతికత’పై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘనపై జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్పై వ్యాఖ్యల కేసులో పవన్ ఖేరాకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.