Home » Supreme Court
క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్ కమిషన్కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టును వైద్య విద్య కళాశాల యాజమాన్యాలు ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని తెలిపాయి.
భార్యను పనిమనిషిలా చూడకూడదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరిగిన వైవాహిక వివాదాల కేసు విచారణలో, ఇంటి పనుల్లో భర్తలు కూడా సమానంగా బాధ్యతలు పంచుకోవాలని స్పష్టం చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అవినాశ్ ఏ-7గా ఉన్నారు.
కోల్కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపిన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది హర్షించదగిన పరిణామం కాదని పేర్కొంది.
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్రెడ్డిని ఆదేశించింది.
సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించినట్లయ్యింది. సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ..
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల నియమాలను రూపొందించేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే అది వాళ్ల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.