Home » Student
వినుకొండలోని బీసీ బాలుర హాస్టల్ నరసరావుపేట రోడ్డులోని శ్రీనివాస్ నగర్ ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. ఈ హాస్టల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ కళాశాల విద్యార్థులు 40 మందికి పైగా ఉంటున్నారు. అయితే ఈ అద్దె భవనంలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని హరీష్రావు ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)లో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇక్కడ సీటు రాదని తేలిపోయిన విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు వరుస కడుతున్నారు.
ఎల్బీనగర్లో గ్యాంగ్ వార్ రాజుకుంది. ఒకరిపై ఒకరు దాడి విద్యార్థులు చేసుకున్నారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొట్టుకున్న వాళ్లంతా అవినాష్ కాలేజీ విద్యార్థులుగా తెలుస్తోంది.
పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న అంశాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లోకేశ్ సోషల్ ఆడిట్' పేరుతో సమగ్ర విషయ సేక రణ నిర్వహించాలని ఆదేశించగా, కొద్దిరోజు లుగా ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది.
మార్కులు తక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి.. ప్రోగ్రెస్ రిపోర్ట్లో దిద్దుకునే విద్యార్థులను చాలామంది చూసి ఉంటారు. సున్నాలు చుట్టడం, సున్నాను ఎనిమిదిగా మార్చడం, ఒకటిని ఏడుగా మార్చడం.. ఇలాంటి బురిడీ కొట్టించే సన్నివేశాలు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఇలాంటివి పాఠశాల స్థాయిలో చిన్నారులు చేసే చిలిపి చేష్టలుగా...
పుస్తకం.. ఇక విద్యార్థుల ప్రతిభకు కొలమానం కానుంది. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో అగ్రస్థానంలో ఉన్నాడు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు.. అనే విషయాన్ని ఆ పుస్తకం తెలియజేస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి జవాబులను ఈ పుస్తకాల్లో రాయించనున్నారు.
మండలకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మూడో రోడ్డులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను భవనాల కొరతతో గార్లదిన్నెకు మార్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనంలోకి 2016లో దీన్ని తరలించారు. మైనార్టీ గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రాప్తాడు సమీపంలో 6.72 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అలాగే భవన ...
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. ఈ పేరు చెబితే ఒకటి కాదు.. మేధావి, శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్, స్ఫూర్తి ప్రదాత, నిరాండబరత, ఇలా ఎన్నెన్నో గుర్తొస్తాయి. విద్యార్థుల ప్రగతి కోసం నిత్యం పరితపించే ఆయన.. వారి కోసం పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని అద్భుత సూక్తులు..
ప్రాణాలు కాపాడే వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతున్నారు. గంజాయి విక్రయం కేసులో ఇటీవల బొల్లారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ అహ్మద్, బీదర్కు చెందిన జరీనా బేగంను పోలీసులు అరెస్టు చేశారు.