Home » Student Corner
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలలను ఆప్షన్గా నమోదు చేసుకోవాలని హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయిసుధీర్ సూచించారు. మంగళవారం హెల్త్ వర్సిటీలో వారు మీడియాతో మాట్లాడారు.
‘నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు మంచి క్రమశిక్షణను మా ఉపాధ్యాయులు నేర్పారు’ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఆయా హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఉన్నత విద్యాశాఖలో ఇష్టానుసారంగా కాలేజీల షిఫ్టింగ్కు అనుమతులు ఇస్తున్నారు. కౌన్సెలింగ్ సమయంలో రెండు డిగ్రీ కాలేజీలను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి నుంచి వేరే మండలాలకు మార్చుకునేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు.
పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు.
వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 37 రకాలకు చెందిన నాలుగు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది.
ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.